అమరావతి మారథాన్‌లో మనమూ పాల్గొందామా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ పోలీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'అమరావతి మారథాన్ - 2018'ను జనవరి 7, 2018 తేదిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు.

Last Updated : Dec 30, 2017, 02:30 PM IST
అమరావతి మారథాన్‌లో మనమూ పాల్గొందామా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ పోలీస్ సంయుక్తంగా 'అమరావతి మారథాన్ - 2018' పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని జనవరి 7, 2018 తేదిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఈ మారథన్ ప్రారంభమవుతుందని.. ఈ సందర్భంగా 5కె, 10కె, 21కె రన్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
 
ఆసక్తి గల ఔత్సాహిక క్రీడాకారులతో పాటు విద్యార్థులు, పౌరులు కూడా ఈ మారథాన్‌లో పాల్గొనాలని భావిస్తే.. www.amaravatimarathon.run వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఈ మారథాన్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలియజేశారు. అమరావతి రాజధాని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ఈ మారథాన్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమ డైరెక్టర్ మురళి నన్నపనేని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 

Trending News