భార్యను బెదిరించబోతే ప్రాణం పోయింది

లాక్‌డౌన్ వల్ల కువైట్‌లో చిక్కుకుపోయిన భార్యను ఎలాగైనా సరే స్వస్థలానికి రప్పించాలని ఆమె భర్త భావించాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు బెదిరించే యత్నం చేశాడు.

Last Updated : May 5, 2020, 08:47 AM IST
భార్యను బెదిరించబోతే ప్రాణం పోయింది

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. విదేశాల నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు స్వదేశానికి అనుమతించారు. అయితే లాక్‌డౌన్ వల్ల కువైట్‌లో చిక్కుకుపోయిన భార్యను ఎలాగైనా సరే స్వస్థలానికి రప్పించాలని ఆమె భర్త భావించాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు బెదిరించే యత్నం చేశాడు. పొరపాటున తాడు మెడకు బిగుసుకుపోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. నటి పూజా ఝవేరి లేటెస్ట్ ఫోటోస్

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తాళ్లపూడి పోలీసుల కథనం ప్రకారం. మండలంలోని మలకపల్లికి చెందిన గణేష్.జి (35) భార్య ఐదు నెలల కిందట బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లింది. లాక్‌డౌన్ వల్ల అక్కడే ఉండిపోయిన భార్య స్వస్థలానికి ఎలాగైనా రప్పించాలనుకున్నాడు.బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!

ఆదివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకోబోతున్నట్లుగా చేసి భార్యను బెదిరిద్దామనుకున్నాడు. ప్రమాదవశాత్తూ ఆ తాడు మెడకు బిగుసుకుపోయి గణేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సెల్ఫీ వీడియోలో రికార్డయింది. దీనిపై గణేష్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్ వివరించారు. ఇలాంటి చేష్టలు మానుకోవాలని ప్రజలకు పోలీసులు సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News