Mani Ratnam: స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు కరోనా పాజిటివ్

Mani Ratnam: స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 06:56 PM IST

Mani Ratnam: దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చారిత్రక నేపథ్య చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌-1’ సెప్టెంబరు 30న విడుదల కానుంది. గత వారం ఈ చిత్రం టీజర్‌ లాంఛ్‌ కార్యక్రమంలో మణిరత్నంతో పాటు చిత్ర బృందం పాల్గొంది. అయితే.. ఆ సమయంలో ఎవరూ కొవిడ్‌ నియమాలను పాటించలేదు. కొన్ని నెలల క్రితం పొన్నియన్‌ సెల్వన్‌-1లో కీలక పాత్ర పోషించిన శరత్‌ కుమార్‌ కరోనాకు గురై వెంటనే కోలుకున్నారు. ఈ చిత్ర కథానాయకుడు విక్రమ్‌ కూడా ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు

Video ThumbnailPlay icon

Trending News