Hyderabad woman doctor Shravani dead: మలక్‌పేట్‌లో కారు హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన లేడీ డాక్టర్ శ్రావణి మృతి

Car Hit And Run Case in Hyderabad: మలక్‌పేట్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్‌ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ.. మూడు రోజులుగా ఆమె నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. ఇక నిందితుడిని ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడికి లైసెన్స్‌, కారుకు పేపర్లు సైతం లేవని వెల్లడించారు పోలీసులు.

  • Zee Media Bureau
  • Sep 25, 2022, 12:54 AM IST

Hyderabad woman doctor Shravani lost life in Car Hit And Run Case: శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డెంటల్‌ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. నెల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇది రెండో విషాదం చోటుచేసుకుంది. 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండెపోటుతో కన్నుమూసింది. సెప్టెంబర్‌ 21వ తేదీన ఓలా బైక్‌ బుక్‌ చేస్కొని శ్రావణి వెళ్తుండగా.. గుర్తు తెలియని కారు ఒకటి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓలా బైక్‌ డ్రైవర్‌ వెంకటయ్య, శ్రావణి గాయపడగా.. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆమె తుది శ్వాస విడిచింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఇబ్రహీంను గుర్తించారు పోలీసులు.

Video ThumbnailPlay icon

Trending News