WTC Final 2021: ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో బౌలింగ్‌కు సై అంటున్న Team India కెప్టెన్ Virat Kohli

WTC Final 2021: సౌతాంప్టన్‌లో విరాట్ కోహ్లీ సహా భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ బ్యాట్ పక్కనపెట్టి బౌలింగ్ సైతం ప్రాక్టీస్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. BCCI షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 13, 2021, 02:16 PM IST
WTC Final 2021: ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో బౌలింగ్‌కు సై అంటున్న Team India కెప్టెన్ Virat Kohli

WTC Final 2021: విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పరుగుల యంత్రం, ఛేజింగ్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. యూకేలోని సౌతాంప్టన్‌లో విరాట్ కోహ్లీ సహా భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ బ్యాట్ పక్కనపెట్టి బౌలింగ్ సైతం ప్రాక్టీస్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తోన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Team India captain Virat Kohli) బంతిని అందుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు అతడు సంధించిన బంతికి ఫలితం ఎలా ఉంటుందని భావిస్తున్నారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్వీట్ చేసింది. స్ట్రైట్ డ్రైవ్, డిఫెన్స్, ఎల్బీడబ్ల్యూ అని ఆప్షన్స్ ఇచ్చింది. బీసీసీఐ షేర్ చేసిన మరో వీడియోలో కోహ్లీ వేసిన బంతి ఇన్‌స్వింగర్ అని అర్థమవుతోంది. కేఎల్ రాహుల్ అతికష్టమ్మీద ఆ బంతిని డిఫెన్స్ ఆడినట్లు రెండో వీడియోలో చూడవచ్చు.

Also Read: French Open 2021 Winner Female: ఫ్రెంచ్ ఓపెన్ విజేత Krejcikova, 40 ఏళ్ల తర్వాత చెక్

టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ మరియు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పరుగులు సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. యువ ఓపెనర్ గిల్ 135 బంతులాడి 85 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 94 బంతుల్లో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇషాంత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు. జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా (Team India) పేస్ దళానికి ఇషాంత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. 

Also Read: WTC Final 2021: సౌతాంప్టన్‌లో Team India ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన BCCI

కాగా, గత 18 ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న అన్ని ఐసీసీ ఈవెంట్లలోనూ టీమిండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. లక్కీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోనూ టీమిండియాకు కివీస్ చేతిలో ఓటములు తప్పలేదు. కోహ్లీ కెప్టెన్సీలోనూ 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అదే సీన్ రిపీట్ అయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News