రిసెప్షన్ కి మోదీని ఆహ్వానించిన విరుష్క జంట

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బుధవారం సాయంత్రం నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ మోదీని రిసెప్షన్ కి ఆహ్వానించారు.

Last Updated : Dec 21, 2017, 11:02 AM IST
రిసెప్షన్ కి మోదీని ఆహ్వానించిన విరుష్క జంట

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బుధవారం సాయంత్రం నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ మోదీని రిసెప్షన్ కి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారిద్దరిని అభినందించారు.

జట్టు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ సిద్ధంగా ఉంది. విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవలే టుస్కానీలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహ రిసెప్షన్ లు ఢిల్లీలో, ముంబైలో జరగనున్నాయి. డిసెంబర్ 21న తాజ్ డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ యొక్క దర్బార్ హాల్ లో రిసెప్షన్ జరుగుతుంది. హోటల్ ను అందంగా ముస్తాబు చేశారు. రెండవ రిసెప్షన్ కూడా ముంబైలో జరిగాక ఇద్దరూ హనీమూన్ కు వెళ్తారు. కొత్త సంవత్సరం వేడుకలను విదేశాల్లో జరుపుకుంటారు.

 

Trending News