Yadadri Temple: నరసింహా జయంతి వేళ యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఉచిత దర్శనం.. టైమింగ్స్ ఇవే..

Yadadri news: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తులకు తీపికబురు చెప్పింది. ఇప్పటికే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంను దర్శించుకొవడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు.  ఇక వీకెండ్స్ లలో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది.

1 /6

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శించుకొవడానికి భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్నారు. ఇటీవల యాదాద్రిని అద్భుతంగా డెవలప్ చేసిన విషయం తెలసిందే. శని,ఆది వారాలు వచ్చాయంటే అందకు యాదాద్రికి వెళ్లిపోతున్నారు.  స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

2 /6

ఇటీవలే యాదాద్రి దేవస్థానం అధికారులు ఆలయంలో డ్రెస్ కోడ్ ను తప్పనిసరి చేస్తు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలసిందే. ముఖ్యంగా ఆర్జీత సేవలైన సత్యనారాయణ స్వామి వ్రతం , హోమాలు, కళ్యాణం, ఇతర స్వామి వారి కైంకర్యాలలో పాల్గొనే భక్తులు విధిగా డ్రెస్ కోడ్ ఫాలో కావాలి.

3 /6

పురుషులైతే తెల్లని లుంగీ లేదా ధోతీ, మహిళలు చీరలు, అమ్మాయిలు పంజాబీ డ్రెస్సులో రావాలని దేవస్థానం సిబ్బంది సూచించారు. భక్తులు ఈ సూచనలను తప్పకుండా పాటించాలని దేవలయ సిబ్బంది స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దివ్యాంగులు, వృద్ధులకు ఆలయంలో స్పెషల్ దర్శనం కల్పించనున్నారు.

4 /6

ప్రతిరోజూ ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు, 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య తూర్పు గోపురం నుంచి దివ్యాంగులు, వృద్ధులకు నేరుగా ఆలయంలోకి అనుమతించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్ రావు సంబంధిత విభాగానికి ఉత్తర్వులు జారీ చేశారు.

5 /6

ప్రస్తుతం యాదాద్రిలో నర్సింహా స్వామి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వేలాదిగా తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు . తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడకు వచ్చి స్వామి వారికి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. 

6 /6

ప్రతిరోజు యాదాద్రిషుడికి ప్రత్యేకంగా పూజలు, అష్టోత్తరాలు, కుంకుమార్చన , వేద పఠనం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామి వారిని అచ్చం తిరుమలేషుడిలాగా అందంగా అలకంరించి ప్రతిరోజు ప్రత్యేక వాహానాల్లో భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి ఈ నిర్ణయం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.