Sai Pallavi: అమరన్ రిలీజ్ వేళ సాయి పల్లవికి బిగ్ షాక్.. ఆ వీడియోపై మరోసారి భగ్గుమంటున్న నెటిజన్లు..

Sai Pallavi controversy comments on Indian army: సాయిపల్లవి మరోమారు వార్తలలో నిలిచారు. ఆమె గతంలో ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్ లు ఆమెపై భగ్గుమంటున్నట్లు తెలుస్తొంది.

1 /8

సాయి పల్లవి ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు ఆమె తన సినిమాల పరంగా వార్తలలో ఉంటే, మరికొన్ని సార్లు మాత్రం.. ఏదో ఒక వివాదస్పద అంశంతో వార్తలలో ఉంటున్నారు.

2 /8

గతంలో నిత్య మీనన్ కు గార్గి మూవీకిగాను జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె అభిమాను మాత్రం.. సాయి పల్లవికి రావాల్సిన అవార్డును నిత్యకు ఇచ్చారని ఫైర్ అయ్యారు.   

3 /8

సోషల్ మీడియాలో సాయి పల్లవి ఫ్యాన్స్ వర్సెస్ నిత్యమీనన్ ఫ్యాన్స్ లా మారిందని చెప్పుకొవచ్చు. దీంతో ఇది కాస్త నిత్య మీనన్, సాయి పల్లవిల మధ్య అఘాతం క్రియేట్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి.

4 /8

ఇదిలా ఉండగా.. సాయిపల్లవి, శివకార్తీకేయర్  ప్రధాన పాత్రల్లో పోషించిన అమరన్ చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది.  పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.  

5 /8

ఈ సినిమాలో.. ముకుంద్ పాత్రను.. కార్తీకేయర్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయిపల్లవి గతంలో ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రాజేసినట్లు తెలుస్తొంది.

6 /8

 విరాట పర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఉగ్రవాదం గురించి సాయిపల్లవి వివాదస్పదంగా మాట్లాడినట్లు తెలుస్తొంది. ఒకప్పుడు చట్టాలు లేని కాలంలో హింస జరిగిందంటే.. ఏదో అనుకొవచ్చు. కానీ ఇప్పుడు ఇంతగా డెవలప్ అయిన కూడా హింసలు జరగటం కరెక్ట్ కాదన్నారు.

7 /8

ఇండియన్ వాళ్లను పాక్ శత్రువులుగా, పాక్ వాళ్లను ఇండియన్ ఆర్మీ శత్రువులుగా భావిస్తుంటామన్నారు. కానీ ఆలోచన దృక్పథం మార్చుకొవాలన్నారు. దీన్ని చూసిన నెటిజన్లు అప్పట్లోనే.. పాక్ మనం ఒక్కటనడానికి మనస్సు ఎలా వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

8 /8

పాకిస్థాన్ సైనికులు అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి అమాయకులైన భారతీయుల ప్రాణాలు తీస్తుంటారని కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, పాక్ ను ఒక్కటే అంటూ సాయి పల్లవి గతంలో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మరోసారి భగ్గుమంటున్నారు.