Rahu-Ketu Gochar 2025: చిక్కని గ్రహాలు ఈ రాశులవారికి బోలెడు డబ్బులు ఇవ్వబోతున్నాయి!

Rahu-Ketu Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహాలుగా చెప్పుకునే  రాహు, కేతువు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు 18 నెలల పాటు సమయం పడుతుంది. అంతే సంవత్సరం నర పాటు ఈ గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. అయితే ఈ గ్రహాలు సంచారం చేయడం వల్ల దాదాపు అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. రాహువు గ్రహం 2023 సంవత్సరం అక్టోబర్‌ 30న మీన రాశిలోకి సంచారం చేసింది. 

1 /7

అంతేకాకుండా అక్టోబర్‌ 30వ తేదిన కేతువు గ్రహం కూడా రాశి సంచారం చేసింది. అయితే ఈ రెండు గ్రహాలు 2025 సంవత్సరంలో సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి.   

2 /7

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కేతువు గ్రహాలను భౌతిక సుఖానికి సూచిగా భావిస్తారు. దీని కారణంగా ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉన్న రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.   

3 /7

రాహు-కేతువు గ్రహాల సంచారం కారణంగా మిథున రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కారణంగా అదృష్టం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.   

4 /7

మిథున రాశివారికి ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు.   

5 /7

మకర రాశివారికి రాహువు, కేతువు గ్రహ సంచారాల కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.  

6 /7

మకర రాశివారికి ఈ సంచారాల కారణంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ లభించడమే కాకుండా కెరీర్‌ జీవితంలో అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో ఏది కావాలనుకున్న అది దోరుకుతుంది. 

7 /7

రాహు-కేతువు సంచారాల కారణంగా కుంభ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు భౌతిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి. దీని కారణంగా ఆనందం రెట్టింపు అవుతుంది.