BRS KCR: గొప్ప మనసు చాటుకున్న గులాబీ బాస్.. కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డకు 24 లక్షల రూపాయల చెక్కు..

TS Formation Day 2024: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను గులాబీ బాస్ కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించి, వారి త్యాగాలను మరోకసారి గుర్తు చేసుకున్నారు.

1 /6

తెలంగాణలో ఈరోజు ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి, ఉత్సవాలు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మంగా ఏర్పాట్లు చేసింది. అటు బీఆర్ఎస్ కూడా తెలంగాణను ఢిల్లీ మెడలు వంచి సాధించుకున్న పార్టీగా , ఉత్సవాలను తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు.

2 /6

తెలంగాణ ఉద్యమం అనేది ఎందరో త్యాగాలు, ఆత్మబలిదానాల వల్ల సాకారమైందని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్నారు. అప్పుడు కేసీఆర్ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. 

3 /6

మాట తప్పని కేసీఆర్.. కిష్టయ్య ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. వీరి చదువులకు అయ్యే ఖర్చులన్ని మాజీ సీఎం కేసీఆర్ భరించుకుంటూ వచ్చారు. కిష్టయ్య కూతురు ఇటీవల పీజీ చదువుతుంది.

4 /6

ఎంబీబీఎస్ కాలేజీలో ఉన్నత చదువుల కోసం మరోసారి కేసీఆర్ వీరికి అండగా నిలిచారు. కిష్టయ్య బిడ్డ ప్రియాంకకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావలసిన 24 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ అందజేశారు.

5 /6

అంతేకాకుండా.. ఈ రోజు నందినగర్ లోని.. కిష్టయ్య కుటుంబంతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండని కిష్టయ్య పిల్లలకు మంచి మాటలు చెప్పారు.

6 /6

కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి, ఆనాడేనేనున్నానని కేసీఆర్ అండగా నిలిచారు. ఆ మాట ప్రకారం.. ప్రతిసందర్భంలోను కేసీఆర్ ఆమాటను నిలుపుకుంటూ వస్తున్నారు. దీంతో గులాబీ బాస్ గొప్ప మనస్సు పట్ల ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.