7th Pay Commission: 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు Travel Allowanceపై లేటెస్ట్ అప్‌డేట్

  50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పింది. గత ఏడాదిన్నర కాలం నుంచి బకాయిపడ్డ తమ డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ (Dearness Relief)ను త్వరలో చెల్లించనున్నారు. ఈ మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించారు.

7th Pay Commission Latest News:  50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పింది. గత ఏడాదిన్నర కాలం నుంచి బకాయిపడ్డ తమ డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ (Dearness Relief)ను త్వరలో చెల్లించనున్నారు. ఈ మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించారు.

1 /5

7th Pay Commission Latest News:  50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పింది. గత ఏడాదిన్నర కాలం నుంచి బకాయిపడ్డ తమ డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ (Dearness Relief)ను త్వరలో చెల్లించనున్నారు. ఈ మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించారు. Also Read: 7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు

2 /5

జూలై నెల నుంచి వీరికి డియర్‌నెస్ అలవెన్స్ 17 శాతం నుంచి 25 లేదా 28 శాతానికి పెరగనుందని జాతీయ మీడియాలు రిపోర్ట్ చేస్తున్నాయి. జూలై నెల వేతనాలలో సవరించిన డీఏ మరియు డీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు అందుకోనున్నారు. Also Read: Night Duty Allowance: నైట్ డ్యూటీ అలవెన్స్‌ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

3 /5

సరిగ్గా ఇదే సమయంలో  కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులుకు షాకింగ్ వార్త చెప్పనుందని రిపోర్టులు చెబుతున్నాయి. ట్రావెలింగ్ అలవెన్స్ (Travel Allowance) ఇప్పట్లో పెరగదని, జులై వేతనాలలో ఉద్యోగులకు కొత్త టీఏ రాదని సమాచారం. టీఏ పెరగాలంటే డియర్‌నెస్ అలవెన్స్ 25 లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. 

4 /5

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత డీఏ 17 శాతంగా ఉంది. 2019 జూలై నుంచి వారికి అదే డీఏనే అందిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత మూడు దఫాలలలో పెరగాల్సిన డీఏ, డీఆర్ పెంచలేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించింది. 

5 /5

జనవరి 1, 2020 నుండి జూన్ 2020 వరకు 3 శాతం డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సి ఉంది. జూలై 1, 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం జనవరి 1, 2021 నుండి జూన్ 2021 కాలానికిగానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ రావాల్సి ఉంది. ఈ మూడు పెండింగ్ డీఏలు 3+4+4 మొత్తం 11 శాతం చెల్లించాల్సి ఉంది. తాజాగా ఈ మూడు పెండింగ్ డీఏలు కలిపితే వచ్చే మొత్తం 28 శాతం డీఏను జూలై వేతనంలో సవరించి కొత్త జీతాలు అందించనున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook