Kerala Water Metro: దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో.. ప్రత్యేకతలు తెలుసా..!

Kerala Water Metro Project: మీరు ఇప్పటివరకు భూమిలోపల వెళ్లే మెట్రో చూశారు.. రెండంతస్తుల ఆకాశ మార్గంలో వెళ్లే మెట్రోను కూడా చూశారు. కానీ కేరళలో వాటర్‌పై మెట్రో ట్రైన్ నడవనుంది. దేశంలోనే తొలిసాని కొచ్చిలో మంగళవారం ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రత్యేకతలు తెలుసుకుందాం..

1 /5

ఈ వాటర్ మెట్రో రైలు కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతూ ప్రయాణించనుంది. ఇది కేరళలోని ఈ ద్వీపాలలో కనెక్టివిటీని మరింత పెంచనుంది.   

2 /5

వాటర్ మెట్రో సాధారణ మెట్రోలానే ఉంటుంది. పోర్ట్ సిటీలో రూ.1,136.83 కోట్లతో కొచ్చి వాటర్ మెట్రోను నిర్మించారు. బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ బోట్లను ఈ ట్రైన్‌లో వినియోగించారు. 

3 /5

వాటర్ మెట్రో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, పర్యావరణ రహితంగా ఉంటుంది. వికలాంగులకు ప్రత్యేక సదుపాయలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతపై ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

4 /5

వాటర్ మెట్రో ప్రాజెక్టులో 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్ ఉంటాయి. మొదటి దశలో హైకోర్టు-వైపిన్ టెర్మినల్, విట్టిల-కక్కనాడ్ టెర్మినల్ మధ్య మొదలుకానుంది.  

5 /5

ప్రారంభంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాటర్ మెట్రోను నడపనున్నారు. పీక్ అవర్స్‌లో ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో గోరఖ్‌పూర్‌, శ్రీనగర్‌, జమ్మూలో వాటర్ మెట్రోను ప్రవేశపెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.