ఇక ఎన్నారైలకూ ఓటుహక్కు..!

   

Last Updated : Nov 11, 2017, 02:38 PM IST
ఇక ఎన్నారైలకూ ఓటుహక్కు..!

భారతదేశంలో ఓటుహక్కుని ఇక ప్రవాస భారతీయులు కూడా వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించిన ప్రజా ప్రాతినిథ్య చట్టం సవరణ బిల్లును పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ అదే బిల్లు అమల్లోకి వస్తే  దాదాపు 2 కోట్ల మంది ఎన్‌ఆర్‌ఐలు స్వదేశంలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రవాస భారతీయులు పోస్టల్‌, ఈ-బ్యాలెట్ల ద్వారా ఓటు వేసేందుకు చట్టం అనుమతి ఉందా? లేకపోతే ఆ చట్టాన్ని సవరించే యోచన ఉందా? అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం జవాబిచ్చింది. త్వరలోనే ఈ విషయమై బిల్లు ప్రవేశపెడతామని తెలిపింది.  కేవలం చట్టంలో నియమాల మార్పు వల్ల ప్రవాస భారతీయులు ఓటు వేయడం కుదరదని, పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశ పెట్టడమే సరైన ఉపాయమని  అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై త్వరగతిన నిర్ణయం తీసుకోవాలని జులై 14 తేదీన కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం పోల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. 

Trending News