ఫ్లిప్ కార్ట్ సేల్స్: మొబైల్స్ పై భారీగా డిస్కౌంట్స్..

గాడ్జెట్ ప్రియలకు అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్, ఈ నెల  ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 21 వరకు బిగ్ బొనాంజా ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ లో అద్భుతమైన ఆఫర్లను 

Last Updated : Feb 16, 2020, 10:41 PM IST
ఫ్లిప్ కార్ట్ సేల్స్: మొబైల్స్ పై భారీగా డిస్కౌంట్స్..

హైదరాబాద్: గాడ్జెట్ ప్రియలకు అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్, ఈ నెల  ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 21 వరకు బిగ్ బొనాంజా ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ లో అద్భుతమైన ఆఫర్లను హైలైట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కాంపెయిన్ ను ప్రారంభించింది.  ఈ- కామర్స్ ద్వారా  పోర్టల్లో కొనుగోలు చేసేవారికి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ను ఉపయోగించే వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తుందని పేర్కొంది.  

గణనీయంగా తగ్గనున్న శాంసంగ్ ఏ20s మొబైల్ ధర..   

ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు శాంసంగ్‌ తన గెలాక్సీ ఎ20 ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.13,999 ఉండగా, ఈ ఫోన్‌ను ప్రస్తుతం మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇక ఇదే ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌ వేరియెంట్‌ ధర బారీగా తగ్గొచ్చని అభిప్రాయపడుతున్నారు. గెలాక్సీ ఎ20 ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌, 13, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.  
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News