Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..

Raj Tarun Lavanya controversy case: హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నిన్న (శుక్రవారం ) అతని ప్రియురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మాల్వీ మల్లోత్రా తండ్రి, సోదరుడు చంపుతానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 6, 2024, 01:57 PM IST
  • రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం..
  • సాయంత్రం వరకు వేచిచూస్తామన్న పోలీసులు..
Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..

Big Twist in rajtarun and Lavanya cheating case: టాలీవుడ్ లో ఇటీవల అనేక మంది నటి నటులు తరచుగా వివాదాలలో ఉంటు వార్తలలో ఉంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె బెయిల్ పైన విడుదలయ్యారు. గత కొంత కాలంలో సినిమా రంగంలో నటినటుల మధ్య ఎఫైర్ లకు సంబంధించి వార్తలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల పవిత్ర జైరామ్ ల ఘటనలు అదే విధంగా కన్నడ నాట.. దర్శన్ లవర్ పవిత్ర గౌడల ఘటనలు తీవ్ర దుమారంగా మారాయి. దీంతో చాలా మంది గ్లామర్ ముసుగులో ఇలాంటి పాడు పనులు చేస్తున్నారని, ఒక చెడ్డపేరును మూవీ ఇండస్ట్రీ మూటకట్టుకుంది.

Read more: Snake bite: నాగు పాముకు చుక్కలు చూపించిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

ఇదిలా ఉండగా.. తాజాగా, టాలీవుడ్ హీరో  రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని అతని ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తాము గుడిలో పెళ్లి చేసుకున్నామని పదకొండేళ్ల పాటు లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నామంటూ కూడా చెప్పింది. ఈ క్రమంలో మౌల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తిరగబడారా సామి అనే మూవీ చేస్తున్నప్పుడు, ఇద్దరి మధ్య ఎఫైర్ ఏర్పడిందని లావణ్య చెప్పింది. అంతేకాకుండా.. ఇద్దరు కలసి హైదరాబాద్ కు వచ్చినప్పుడు.. డైరెక్టర్ రవి ఇంట్లో సీక్రెట్ గా కలుసుకునేవారని చెప్పింది.

ఈ విషయం తనకు తెలిసి నిలదీయడంతో తనను చంపుతామంటూ మౌల్వీ మౌల్వీ మల్హోత్రా  తండ్రి, సోదరుడు తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం మంచి ఫ్రెండ్ అని, చంపి బాడీ కూడా దొరక్కుండా మాయం చేస్తామంటూ కూడా బెదిరించారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు రాజ్ తరుణ్ మాత్రం వీటిని ఖండించారు. లావణ్యకు డ్రగ్స్ కు బానిసగా మారిందని, ఆమెకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫైర్ ఉందని కేవలం డబ్బుల కోసమే తనను బెదిరిస్తుందని అన్నారు. అంతేకాకుండా.. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 లావణ్య కు నోటీసులు ఇచ్చిన నర్సింగి పోలీసులు..

ఇదిలా ఉండగా.. హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యకు..నార్సింగ్ CI హరికృష్ణ నోటీసులు జారీచేశారు. 
లావణ్య విమెన్ ఆఫీసర్ కు 4 పేజీల ఫిర్యాదు కాపీ ఇచ్చి వెళ్లింది. అదే విధంగా ఈ కంప్లైంట్..కూడా  ఫార్మాట్ లో లేదు. హీరో రాజ్ తరుణ్ తోపాటు.. మరికొందరి పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

దీనిలో తేదీలు, సమయం, ప్లేస్.. ఇలాంటి వివరాలేవీ ఫిర్యాదు లో పేర్కొనలేదు.  అంతేకాకుండా.. తాము ఇచ్చిన నోటీసుకు లావణ్య స్పందించలేదు.. కాల్స్ చేసినా ఆన్సర్ చేయడం లేదు. ఈరోజు సాయంత్రం వరకు ఈ ఫిర్యాదుపై వేచీ చూస్తాం. ఒక వేళ లావణ్య నుంచి ప్రాపర్ గా రెస్పాన్స్ లేకుంటే మాత్రం.. తప్పుడు ఫిర్యాదు గా పరిగణిస్తామని పోలీసులు తెల్చి చెప్పారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News