ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్, సీఎం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Jan 1, 2018, 12:57 PM IST
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్, సీఎం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ ఈ కొత్త సంవత్సరం చిరస్మరణీయం కావాలని చెప్పారు.

గవర్నర్ నరసింహన్ 

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రతి పౌరుడికి నూతన నూతన సంవత్సరం  2018 ఉల్లాసం, సంతోషాన్ని తీసుకొచ్చేలా కోరుకుంటున్నా.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 

తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ చిరస్మరణీయం కావాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా. 

 

వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్

2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారితీయాలని కోరుకుంటున్నా. 

 

Trending News