నిర్మాతగా మారుతున్న అల్లు అర్జున్ ! దర్శకుడు ఎవరో తెలుసా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాతగా మారబోతున్నాడు

Last Updated : Mar 9, 2018, 07:14 PM IST
నిర్మాతగా మారుతున్న అల్లు అర్జున్ ! దర్శకుడు ఎవరో తెలుసా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాతగా మారబోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా త్వరలోనే క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది అని గతంలోనే చెప్పుకున్నాం. వేదం సినిమా తర్వాత మళ్లీ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ చేయనున్న మరో సినిమా ఇదే అవుతుంది. వేదం సినిమా కమెర్షియల్ గా హిట్ కాకపోయినా... నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులకు పేరు తీసుకొచ్చిన సినిమా అది. అందుకే ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అది తప్పకుండా బాగుంటుందని ఇరువురి అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు.

అహం బ్రహ్మస్మి అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాను స్టైలిష్ స్టార్ ఓ సహ నిర్మాతగా నిర్మించనున్నాడు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన తండ్రితో కలిసి నిర్మించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అయితే, ఈ సినిమాలో కొంత తాను కూడా పెట్టుబడి పెట్టి, రిలీజైన తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటాను అని చెప్పాడట అల్లు అర్జున్. ఏమైనా నిర్మాతకు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కదా.. ఒక మంచి సినిమా చేసేటప్పుడు అందులో తాను భాగస్వామిని అవ్వాలని అల్లు అర్జున్ అనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్.

Trending News